14 April, 2026 | 4:59 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

అంబరాన్నంటిన కార్తీక దీపోత్సవ వేడుకలు

20-11-2025 12:00 AM

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్  (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్తిక దీపోత్సవం వేడుకలు అంబరాన్నంటేలా సాగాయి. లక్షట్ పేటకు చెందిన ప్రణవ్ శర్మ ఆధ్వర్యంలో 18 మంది వేద పండితులు ప్రత్యేక శివలింగార్చన గణపతి పూజ చేయడంతో పాటు దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పూజలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, సోనేరావు దంపతులతో పాటు కుమారుడు సాయినాథ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియో జకవర్గ ప్రజల సంక్షేమం కోసం కార్తీకదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు మర్సుకోలా సరస్వతి, బుర్స పోచయ్య, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.