13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కీసర దేవస్థానం చైర్మన్ ప్రమాణ స్వీకారం

08-01-2026 12:00 AM

ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ 

మేడ్చల్, జనవరి 7 (విజయ క్రాంతి): జిల్లాలోని ప్రముఖశైవక్షేత్రం కీసర శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా తటాకం వెంకటేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ శర్మకు శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సన్మానించారు. ఎంపీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. \

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. డిసిసి అధ్యక్షుడు వజ్రష్ యాదవ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బిజెపి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, కీసర మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.