23-04-2025 01:38:14 AM
సిర్గాపూర్, ఏప్రిల్ 22: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని కెజిబివి కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలల్లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సంతోషి కుమారి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో యు. నందిని (975/1000), పి. సోనిక (961/1000), జె. జ్యోతి (941/1000), బి. శ్వేత (937/1000), ఎం. జయశ్రీ (921/1000) సాధించారు. మొదటి సంవత్సరం ఎంపిసిలో పి. అనూష (444/470), ఎస్. లక్ష్మి చైతన్య (405/440) విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల స్పెషల్ ఆఫీసర్ సంతోషి కుమారి, పి.జి.సి.ఆర్.టిలు అభినందనలుతెలిపారు.