6 July, 2026 | 4:21 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొని మహిళా మృతి

17-05-2025 09:50 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గంగాయిపేట గ్రామ శివారులో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివరాల ప్రకారం... శుక్రవారం మెస్రం స్వప్న(28) అనే మహిళ గంగాయపేట శివారు తోట భీమేష్ ఇటుక బట్టీలో పనిచేస్తుండగా ఇటుక లోడ్ చేసిన ట్రాక్టర్ మహిళలను గమనించకుండా రివర్స్ చేయగా ఆ మహిళ ట్రాక్టర్ కిందపడి మరణించిందని మృతురాలికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఆమె అన్న కుడిమెట్ట గంగారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.