31 May, 2026 | 11:28 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

అహ్మదాబాద్ డిఫెండర్స్‌కు కొచ్చి స్పైకర్స్ షాక్

22-10-2025 01:04 AM

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్‌లో సెమీఫైనల్స్‌కు ముందు అహ్మదాబాద్ డిఫెండర్స్‌కు షాక్ తగిలింది.గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్ అహ్మదాబాద్‌కు షాకిచ్చింది. ఇప్పటికే సీజన్ నుంచి నిష్క్రమించిన కొచ్చి 15 స్కోర్‌తో అహ్మదాబాద్‌పై గెలుపొందింది.

ఎరిన్ వర్గీస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అహ్మదాబాద్ మ్యాచ్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటకీ కొచ్చి స్పైకర్స్ పదునైన సర్వీసులకు సమాధానం చెప్పలేకపోయింది. సర్వీస్‌లో 24 పాయింట్లు సాధించగా..అహ్మదాబాద్ 17 పాయింట్లకే పరిమితమైంది.కాగా అహ్మదాబాద్ ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై, బెంగళూరు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.