13 April, 2026 | 4:26 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

మరో మ్యాచ్ ఆడనున్న కోహ్లీ

30-12-2025 12:10 AM

విజయ్ హజారే ట్రోఫీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో మరో మ్యాచ్ ఆడబోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లో ఆడి అదరగొట్టిన కోహ్లీ ఇప్పుడు మూడో రౌండ్ మ్యాచ్‌లకు రెడీ అయ్యాడు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ జరగనున్న నేపథ్యంలో మరొక్క మ్యాచ్‌లో మాత్రమే విరాట్ బరిలోకి దిగుతాడు. జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఆడనున్నాడు.

2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ రోహిత్ శర్మ బీసీసీఐ సూచనతో దేశవాళీ క్రికెట్‌లోకి చాలా రోజుల తర్వాత అడుగుపెట్టారు. విరాట్ తన తొలి మ్యాచ్‌లో సెంచరీ , రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. వింటేజ్ కోహ్లీని గుర్తు చేస్తూ దుమ్మురేపాడు. అటు రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్‌లో శతకం నమోదు చేశాడు.