13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

09-01-2026 03:29 PM

మద్నూర్,(విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అహంకారపూరితంగా అవమానకరంగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ... దేశ ప్రజాస్వామ్యానికి మార్గదర్శకులైన రాహుల్ గాంధీ పై అలాగే ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పై ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు తగదని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.