15 April, 2026 | 12:28 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కేటీఆర్‌కు ఇంకా బుద్ధి మారలేదు

22-11-2025 01:55 AM

కాంగ్రెస్ ఎంపీ చామల 

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ‘ పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది.. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ’ అని  చామల విమర్శలు చేశా రు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ టైం లో ఫాం హౌస్ పాలన తప్ప.. ప్రజా పాలన చే యలేదన్నారు.

కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కుటుంబాన్ని బ్లేమ్ చేయడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదని చామల మండిపడ్డారు. అసలు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటని.. ఆయన కు టుంబంలో ఎంతమంది రాజకీయాల్లో ఉ న్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంట్లో లాగా.. రేవంత్ ఇంట్లో ఎవరికీ పదవులు లేవు కదా ..? అని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు మంచి చేయలేదు.. మేము చేస్తుంటే చేయనియ్యట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.