3 April, 2026 | 3:27 PM

Breaking News

మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •  

లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం

03-07-2025 12:00 AM
  1. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా
  2. జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 2: లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా అన్నారు. ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మె సందర్భంగా బుధవారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మీకి సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం సీఐటీయూ నర్సింహా మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. లేబర్ కోడ్‌ల తీసుకొచ్చి.. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తుందని ధ్వజమెత్తారు. కార్మికులకు ప్రాణత్యాగం చేసి 8 గంటల పని రోజులు సాధించుకుంటే.. 12 గంటలు చేయాలని చూస్తుందని విమర్శించారు. లేబర్ కోడ్‌లతో కార్మికులు హక్కులను కోల్పోతారన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.

నాలుగు లేబర్ కోడ్‌లను ఎత్తివేసి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి.. కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు, పారిశ్రా మిక కార్మికులందరూ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు ఎలకపల్లి మహేశ్, ఆశ వర్కర్లు, రమాదేవి, యమునా, స్వరాజ్యం సుహాసిని,తదితరులుపాల్గొన్నారు.