calender_icon.png 8 July, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

07-07-2025 07:35:22 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ పరిధిలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) పుట్టినరోజు, ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మేడ్చల్ మండల ఇన్చార్జి పరశురాం మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి ఎమ్మార్పీఎస్ సాధించుకున్న ఎస్సీ వర్గీకరణతో పాటు సబ్బండ వర్గాల కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటంలో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం, వృద్ధులకు వితంతువులకు రూ. 2000/- పింఛన్, వికలాంగులకు రూ. 4000/- పింఛన్ సాధించిన  ఆకలికేకల పోరాటంతో ఆరు కిలోల బియ్యం సాధించి పెట్టిన పోరాట ఫలితం ఎమ్మార్పీఎస్ కే సొంతం అవుతుందని అన్నారు.

30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి సహకరించిన మేడ్చల్ మండలంలోని ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మేడ్చల్ లో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్పీఎస్  నాయకులను సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్ గౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సాటే నరేందర్, మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రామచందర్, మాదిగ మాజీ అధ్యక్షులు యాదయ్య,మేడ్చెల్ కో. ఇంచార్జి జీడిపల్లి శివకుమార్, జిల్లా యువసేన ఉపాధ్యక్షులు వై. బాలనర్సింహా, ఎమ్మెస్ పి జిల్లా కార్యదర్శి జీ. రామకృష్ణ, వై.బాలకృష్ణ, జి. రాజకుమార్, ఆనంద్,బాబు, డి.శంకర్, మధుసూదన్, శ్రీను, పద్మారావు, మహేష్, రాజారామ్ వై. నర్సింగరావు, రమేష్, నరేందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.