calender_icon.png 8 July, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి

07-07-2025 07:29:30 PM

యూనిట్ అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన దర్బార్లో గిరిజనుల దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందే విధంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. సోమవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో  వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. 

గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు నూతనంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు కొరకు, ట్రై కార్ ద్వారా సబ్సిడీ రుణాల కొరకు, పొడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాల కొరకు, పట్టా భూములకు రైతు బంధు రుణాల కొరకు, పోడుపట్టాలలో పేర్లు మార్పు కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు, గురుకులం పాఠశాల, కళాశాలల్లో సీట్ల కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు, వ్యవసాయ భూములకు కరెంటు బోరు మోటార్ ఇప్పించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉపాధి పొందటానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, సోలార్ ద్వారా పంట పొలాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, దీర్ఘకాలిక జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు.   

ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మనం,ఆర్సిఓ గురుకులం అరుణ కుమారి, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, పివిటిజి అధికారి రాజారావు,మేనేజర్ ఆదినారాయణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ, ఇతర విభాగాల సిబ్బంది భార్గవి, చలపతి, రామ్ కుమార్, మోహన్, స్వాతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.