11-02-2025 12:05:41 AM
నారాయణపేట, ఫిబ్రవరి10(విజయ క్రాంతి): నారాయణపేట, కొడంగల్ ఎత్తిపో తల పథకానికి సంబంధించిన మొదటి దశ భూ సర్వే ని పూర్తిచేయాలని మల్టీజోన్-2 ఐజిపి సత్యనారాయణ ఐపీఎస్ జిల్లా అధి కారులకు సూచించారు. సోమవారం నారా యణపేట జిల్లా కేంద్రానికి వచ్చిన మల్టీజో న్ -2 ఐజీపీ సత్యనారాయణకు, జోగులాంబ జూన్ 7 డిఐజి ఎల్ ఎస్ చౌహన్ ఐపిఎస్, నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నా యక్, SP యోగేష్ గౌతమ్లు స్థానిక పం చాయతీరాజ్ అతిధి గృహం వద్ద పూల బొ క్కె ఇచ్చి స్వాగతం పలికారు.
అనంతరం కొ డంగల్ ఎత్తిపోతల పథకం భూ సర్వే గురిం చి చర్చించారు. ఈ సందర్భంగా మల్టీ జోన్ -2 ఐజీపి సత్యనారాయణ మాట్లాడుతూ... నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథ కం కోసం LARR Act.2013 ప్రకారం భూ సర్వేను చట్ట ప్రకారం చేయడం జరుగుతుం ది. అలాగే ల్యాండ్ సర్వే చేసే సమయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రేరేపించినట్లు రుజువైతే అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం చర్య లు తీసుకోవాలని ఎస్పీ గారికి సూచించారు.
అయితే సర్వే చేసే సమయంలో అసలు భూ మి లేని వాళ్ళే ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నా రు. సర్వేమొదటి దశ భూ సర్వే జరిగే సమ యంలో ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్ 60 రోజుల లోపు నారా యణ పేట ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కు తమ తమ అభ్యంతరాలు తెలపాలని ఆయన కోరారు.
కానీ నియమ, నిబంధనల ప్రకారం జిల్లాలో కొనసాగుతున్న భూసర్వేను ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసు కోవాలని డిఐజి సత్యనారాయణ ఈ సం దర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగులాం బ జోన్-7 డిఐజి ఎల్ ఎస్ చౌహన్ ఐపిఎస్, జిల్లా ఎస్పీజోగులాం బ జోన్-7 డిఐజి ఎల్ ఎస్ చౌహన్ ఐపిఎస్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు.