16 April, 2026 | 10:03 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

26-11-2025 12:00 AM
  1. భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

జాతీయ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్

దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ

ఏటూరునాగారం,నవంబరు25(విజయక్రాంతి):1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిందని ఈ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జాతీయ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్ అన్నారు.దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు గంపల శివకుమార్ అధ్యక్షతన భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం ర్యాలీ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మైనార్టీ ముదిరాజ్.మాల మహానాడు ఎమ్మార్పీఎస్ నేతకాని ఇతర ప్రజా సంఘాల నాయకులు ఎండి ఖలీల్ ఖాన్.చిటమట రఘు చెన్నూరి బాలరాజు వావిలాల నరసింహారావు గంపల శివకుమార్ దుర్గo లక్ష్మీకాంత్. కర్నే రమేష్. గద్దల నవీన్ లు మాట్లాడుతూ భారత దేశానికి నవంబర్ 26న రాజ్యాంగ రచన పూర్తి చేసుకొని ఆమోదించబడిందని అన్నారు.

రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు. చిటమట రఘు. చెన్నూరి బాలరాజు.ఎండి ఖలీల్. వావిలాల నరసింహారావు. గంపల శివకుమార్ .కుక్కల రాములు. ఉమాగాని రమేష్.దుర్గం లక్ష్మీకాంత్ కర్నే రమేష్ గద్దల నవీన్,రంజిత్,నావత్ కిరణ్.ఎజాజ్,వడిదల హనుమంతు. పాగా నాగరాజు. కందుకూరి రతన్ .సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.