11 August, 2026 | 5:38 PM

Breaking News

పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ వెనక్కి పంపడం దుర్మార్గం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి   •   ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా మల్యాల అంజయ్య నియామకం   •   దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

30-09-2025 04:32 PM

కలెక్టర్ బాదావత్ సంతోష్..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించాల‌ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, కరపత్రాలపై ప్రింటర్ వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అనుమతి లేకుండా జరిగే పార్టీ సమావేశాలపై కేసులు బుక్ చేయాలని సూచించారు. 

అలాగే గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు తొలగించాలని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫ్లైయింగ్ స్కాడ్లు, వెబ్ క్యాస్టింగ్, ఐటీ ఆధారిత పర్యవేక్షణను బలోపేతం చేసి, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్లు, కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు.