9 April, 2026 | 6:54 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి

05-11-2025 12:17 AM

కోదాడ (నడిగూడెం)నవంబర్ 4: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ఎండి ఖలీల్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో  ఈ నెల 7 పెన్షనర్ల సమస్యల పరిష్కారానికై  హైదరాబాదులో  ఇందిరా పార్క్ వద్ద చేపట్టి భారీ నిరసన దీక్ష గోడ పోస్టర్లను  పెన్షనర్లతో కలిసి ఆవిష్కరిం చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదని, పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల సాధనకై ఈ నెల 7న చేపట్టిన దీక్షకు పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బాలాజీ నాయక్, ఇబ్రహీం, అప్పిరెడ్డి, అంజయ్య, అనంతరాములు, వెంకటరెడ్డి, నరసింహారావు, సైదులు, రాములు,   జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.