12 July, 2026 | 1:43 AM

ఉద్యమంలో మధుసూదన్‌రెడ్డిది క్రియాశీలక కృషి

23-07-2025 01:14 AM

-బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): ప్రముఖ తెలంగాణ వాది, ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, సీనియర్ ప్రొఫెసర్ మధుసూధన్ రెడ్డి మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతా పం ప్రకటించారు. తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో ఒక ప్రొఫెసర్‌గా, మేధావిగా, భావజాల వ్యాప్తి చేస్తూ, ఉద్యమ పాఠాలు బోధిస్తూ, వారు క్రి యాశీలక కృషి నిర్వర్తించారని తెలిపా రు. ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డితో తనకున్న ఉద్యమ బంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.