02-10-2025 12:00:00 AM
కరీంనగర్, అక్టోబర్01(విజయక్రాంతి); మహాశక్తి ఆలయం వద్దబుధవారం రాత్రి కరీంనగర్ లో అట్టహాసంగా మహిషాసుర సంహారం కార్యక్రమం జరిగింది. మహిషాసురుడి దిష్టిబొమ్మను దగ్గం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలుమహిషాసుర సంహారాన్ని తిలకిస్తూ జై దుర్గాభవానీ అంటూ నినదించిన భక్తులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూధర్మరక్షణ కోసం చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పర్వదినం అన్నారు.అధర్మానికి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడే వారిపై అంతిమ విజయం ధర్మానిదేఅన్నారు.