16 April, 2026 | 7:20 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నష్టపరిహారం త్వరగా అందేలా చూడండి..

11-11-2025 10:01 PM

బోథ్ (విజయక్రాంతి): వన్యప్రాణుల కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు తక్షణమే ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని బోథ్ నేచర్ కన్జర్వేషన్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అలీ కోరారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు సొసైటీ సభ్యులతో కలిసి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు షేక్ అలీ మాట్లాడుతూ వన్యప్రాణుల దాడులలో పంట నష్టపోయిన బాధిత రైతులు నష్ట పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి బాధిత రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని అన్నారు. కొన్నిసార్లు శాఖల మధ్య సమన్వయం లేక నష్ట పరిహారం కోసం బాధిత రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో సొసైటీ ఉపాధ్యక్షుడు దాసరి పురుషోత్తం, కోశాధికారి వెండి పృథ్వి, సభ్యులు అబ్దుల్ రావుఫ్, రమణ గౌడ్ గొడిసెల తదితరులు ఉన్నారు.