21-05-2025 12:29:58 AM
ఖైరతాబాద్, మే 20 (విజయక్రాంతి) : తెలంగాణ వైతాళికుడు బహుముఖ ప్రజ్ఞాశాలి గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి వేడుకలలో భాగంగా ముగింపు సభను ఈనెల 29న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు గోల్కొండ సాహితీ కళా సమితి తెలిపింది. ఈ మేరకు మంగళవారం శాసనమండలిలో మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ఎందుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
జయంతి ముగింపు సేవకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకుడు చెరుకుపల్లి సీతారాం, ప్రముఖ కవి డాక్టర్ ఏను నరసింహారెడ్డి, గోల్కొండ సాహితి కళా సమితి అధ్యక్షులు డాక్టర్ చంద్రప్రకాశ్ రెడ్డి, బడే సాబ్, గంట మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.