19-07-2025 10:48:14 PM
అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వాపురం మండలం మొండికుంట వైన్స్ షాప్ లో క్యాషియర్ తోట వేణుపై పెట్రోల్ పోసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు అశ్వాపురం సిఐ జి అశోక్ రెడ్డి తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం, విపరీతంగా మద్యం సేవించి అప్పు ఇవ్వాలని అడగగా లేదన్నందుకు వైన్ షాప్ క్యాషియర్ తోట వేణుపై మొండికుంట గ్రామానికి చెందిన నగునూరు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బాటిల్ లో పెట్రోల్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్న వారిపై పోసినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు తరలించినట్లు అశ్వాపురం సిఐ జి అశోక్ రెడ్డి తెలిపారు.