మహిళలపై మాంసం విసిరిన వ్యక్తి అరెస్ట్
గోరఖ్పూర్: యూపీలోని గోరఖ్పూర్లోని పిప్రైచ్ ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో(Hanuman Temple) ప్రార్థన సమయంలో మహిళలపై మాంసం ముక్కలు విసిరిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. పిప్రైచ్ రైల్వే స్టేషన్(pipraich railway station) సమీపంలోని సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల ఉమేష్ యాదవ్ అనే వ్యక్తి 'ఆరతి' సమయంలో మహిళలపై మాంసం ముక్కలను విసిరాడని, ఇది భక్తులలో భయాందోళనలకు కారణమైందని పోలీసులు తెలిపారు. స్థానికులు యాదవ్ను పట్టుకుని, కొట్టి అప్పగించారని పోలీసులు వెల్లడించారు.
యాదవ్ మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక మాంసం విక్రేత తనను అలా చేయమని చెప్పినట్ల ఆ స్థలాన్ని సందర్శించిన చౌరీ చౌరా సర్కిల్ ఆఫీసర్ అనురాగ్ సింగ్ అన్నారు. తరువాత కుట్రదారులని ఆరోపిస్తూ, ఇతర నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక జనసమూహం పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడింది. ఈ కేసులో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పోలీసులు ఆ బృందాన్ని శాంతింపజేశారు. యాదవ్ ఇటీవలే హైదరాబాద్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడని, అక్కడ అతను పెయింటింగ్, డైయింగ్ పని చేసినట్లు అధికారులు తెలిపారు.






