10 June, 2026 | 3:14 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

రాజయ్యనగర్‌లో వ్యక్తి దారుణ హత్య

25-07-2025 01:28 AM

చర్ల, జూలై 24 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాజయ్య నగర్ లో బుధవారం రాత్రి ఓ వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది. రాజయ్యనగర్ క్రాంతిపురం కు చెం దిన మడకం భద్రయ్య ను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు.

రక్తపు మడుగులో పడి ఉన్న భద్రయ్య(34)ను భార్య లక్ష్మి కుటుంబ సభ్యులు చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో డాక్టర్ సాయి వర్ధన్ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు,మార్గం మధ్యలోనే తీవ్రత రక్తస్రావం తో భద్రయ్య మృతి చెందాడు. అంతర్గత కారణాలతోనే దుండగులు భద్రయ్య పై హత్యాయత్నం చేశారని తెలుస్తుంది.