1 July, 2026 | 7:47 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

బాలిక వెంటపడి వేధించిన ఒకరికి ఐదు నెలల జైలుశిక్ష

24-07-2025 12:20 AM

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, జూలై 23:(విజయ క్రాంతి): ఒక బాలిక వెంటపడి పదే పదే వేదించిన గల్చడ్వాడ్ గజానంద్ కు ఐదు నెలల సాదారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాల్ మేజిస్ట్రేట్ (ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ) ఖుష్భూ ఉపాధ్యాయ్ బుధవారం తీర్పు చెప్పారు.కోర్టు తీర్పులోని వివరాలు..

నిజామాబాద్ నగరంలోని మల్లెల రావు ( గోప్యత కోసం పేరు మార్చాము )కిషన్ గంజ్ లో ఒక తినుబండారాలు అమ్ముతుజీవిస్తాడు. అతని కూతురు కాలేజీకి వెళుతువస్తుంది. గల్చడ్వాడ్ గజానంద్ అనే వ్యక్తి పదహారేళ్ళ వయసు గల ఆమె వెంట పదే పదే పడుతు లేనివిపోనివి మీ తండ్రికి చెప్పి నీ పరువు తీస్తానంటూ బెదిరిస్తు, డబ్బులు డిమాండ్ చేయడంతో తండ్రి లాకర్ నుండి తండ్రికి తెలియకుండా యాభై వేలు తీసుకుని అతనికి ఇచ్చింది.

మల్లి మల్లి వెంట పడుతు తండ్రికి విషయం చెప్పింది. తండ్రి, కూతురు కలిసి గజానంద్ ను నిలదీయడంతో అతను తన బంధువులైన జ్ఞానేశ్వర్, దాదరావు లతో కలిసి 6 జనవరి, 2020 న మల్లెల రావు పై చాకు దాడి చేశారనే నేరారోపణలపై నేర న్యాయ విచారణ జరిపిన కోర్టు. బాలిక, ఆమె తండ్రి, ఇతర సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి,

ధ్రువీకరించుకున్న పత్రాలు పరిశీలించి ప్రధాన ముద్దాయి గజానంద్ పై ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 354(డి )ప్రకారం నేరం రుజువు అయినట్లు నిర్దారిస్తూ అతనికి ఐదు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విదిస్తూ తీర్పు వెలువరించారు.జ్ఞానేశ్వర్, దాదరావు లపై నేరారోపణలు రుజువు కానందు న నిర్దోషులుగా విడుదల చేశారు.పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ రహీముద్దీన్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.