15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మక్కలు కొనలేని దిక్కుమాలిన ప్రభుత్వం

13-10-2025 12:48 AM

-ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల వేతనం పెండింగ్ 

-ఎక్స్‌సర్వీస్‌మెన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా 

-మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

సిద్దిపేట, అక్టోబర్ 12 (విజయక్రాంతి): మార్కెట్లోకి రైతులు మొక్కలు తీసుకొచ్చిన కొనుగోలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం పై రైతులు మండిపడుతున్నారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలలుగా వేతనాలు పెండింగ్ ఉండటం అత్యంత బాధాకరమన్నారు.

భార్యకు బస్సు ఫ్రీ అంటూ భర్తకు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యంపై ప్రాధాన్యత తగ్గించిన ప్రభుత్వం ఆస్పత్రులు అధ్వానంగా మారాయని విమర్శించారు. కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు బందు చేసి రోగులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వెల్లడించారు.

ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవానికి హరీష్ రావు హాజరై మాట్లాడారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించిన రక్షకులకు రాష్ర్టంలో సమస్యలు పెరిగిపోయాయని చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఎక్స్ సర్వీస్ మెన్ సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని వెల్లడించారు. సిద్దిపేట వాసవి క్లబ్ నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.