30-09-2025 12:00:00 AM
మందమర్రి, సెప్టెంబర్ 29 : జనగామ లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో పట్టణంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కాలేజ్ విద్యార్థి పి మణిదీప్ అత్యంత ప్రతిభ కనబరిచి అక్టోబర్ 2 నుంచి 12 వరకు శ్రీనగర్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక య్యారు.
సోమవారం మణిదీప్ను డీఐఈఓ అంజయ్య అభినందించారు.మణిదీప్ను ఒలింపిక్ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథరెడ్డి, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి బాబురావు అభినందించారు.