17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పురుగుల మందు తాగి వివాహిత మృతి..

22-05-2025 06:43 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని మోదెలకు చెందిన ఎలగతి శ్రీలత(29) అనే వివాహిత గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిందని ఎస్సై సురేష్(SI Suresh) తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలికి భర్త సురేష్, కూతురు ఆద్యశ్రీ(6), కొడుకు మహన్స్(3) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఆద్యశ్రీకి చిన్నతనం నుండి అనారోగ్యంగా ఉండటం ఆసుపత్రుల్లో తిరిగి మందులు వాడిన నయం కాకపోవడంతో ఇల్లు మార్చాలని వేరే కాపురం పెడదామని భర్తను కోరేది. అది కుదరకపోవడంతో మనస్తాపం చెంది ఈనెల 19వ తారీకున ఇంట్లో గడ్డి మందు తాగిందన్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. మృతురాలి తండ్రి సందేల మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.