13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సిర్గాపూర్‌లో భారీగా చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ

09-01-2026 08:48 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ ర్యాలీ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు పటిల్ ప్రత్యేకంగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యువత క్రీడలలో రాణించి మండలానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో స్థానిక ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిష్యత్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరం శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థులు క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ ర్యాలీని మరింత రంజుగా మార్చారు. ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ర్యాలీతో పాటు మండల కేంద్రంలో నడిచారు. గ్రామంలోని ప్రజలు, యువత, క్రీడాభిమానులు ర్యాలీని అద్భుతంగా స్వాగతించి, గ్రామమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. ర్యాలీ గ్రామం ప్రధాన వీధుల మీదుగా పర్యటించి, చివరకు గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ముగిసింది.