13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు దోహదపడతాయి

09-01-2026 08:46 PM

నాణ్యమైన మొక్కలు పెంచేందుకు కృషి చేయాలి

సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య 

గరిడేపల్లి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు ఎంతగానో దోహదపడతాయని నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలను పెంచాలని గరిడేపల్లి సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో 2025-26 సంవత్సరానికి గాను ఏర్పాటు చేసిన నర్సరీని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీని పర్యవేక్షణ చేసేవారు నాణ్యమైన మొక్కలను అందించే విధంగా కృషి చేయాలని ఆమె కోరారు.నాణ్యమైన మొక్కలను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.