18-08-2025 12:44:07 AM
రాష్ర్ట నీటి పారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్
హుజూర్నగర్, ఆగస్టు 17 : ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ర్ట సివిల్ సప్లు, ఇరిగేషన్ శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే రెండో జాతరగా పేరుపొందిన పొంచర్ల ముత్యాలమ్మ తల్లి జాతర,బోనాల వేడుకకు ఆదివారం మంత్రి ఉత్తమ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ జాతర, నిర్వహణ కమిటీ సభ్యులు మంత్రి ఉత్తమ్ కు స్వాగతం పలికారు. ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్ నగర్ ముత్యాలమ్మ తల్లి అంటేనే మహిమ గలదని ఆతల్లి దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలన్నారు.
అమ్మవారి ఆశీర్వాదంతో ఈ ప్రాంత రైతులను క్షేమంగా చూసుకోవాలన్నారు.దేవాలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు నిధులు కేటాయించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎరగాని నాగన్న,తన్నీరు మల్లికార్జున్,కోతి సంపత్ రెడ్డి, ముత్యాలమ్మ జాతర కమిటీ నిర్వాహణ సభ్యులు,తండు ప్రసాదు, వేముల నరసయ్య, తండు సైదారత్నం, గుండా రమేష్,రామిశెట్టి రాము, తదితరులు,పాల్గొన్నారు.