30 June, 2026 | 10:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు

24-07-2025 12:33 AM

డీఎం అండ్ హెచ్‌ఓ హరీష్‌రాజ్

మంచిర్యాల, జూలై 23 (విజయక్రాంతి) : వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాదులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశించారు. బుధ వా రం నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు తెలంగాణ డయాగ్నొస్టిక్ ను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీల పరిధిలోని గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట ఆసుపత్రిలో సాయంత్రం వరకు ఒక వైద్య సిబ్బంది ఉం డే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంచాలని, రౌండ్ క్లాక్ ఆరోగ్య కేంద్రాలలో సాయంత్రం పూట, రాత్రి ఉండే సిబ్బంది వివరాలు అందజేయాలన్నారు.