15 April, 2026 | 9:29 AM

రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

25-11-2025 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలి పింది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సోమవారం తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 9.4 డిగ్రీలు నమోదైంది.