14-08-2025 01:00:38 AM
జగిత్యాల అర్బన్, ఆగస్టు 13(విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్లో బుధవారం రోజున రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీ డియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమ్పా తీవ్ర విమర్శలు గుప్పించారు.‘తప్పులు మీరు చేసి మమ్మల్ని బదునాం చేస్తారా?‘ అంటూ మంత్రి ప్రశ్నించారు.
విద్యార్థుల సమస్యలపై ఎప్పుడైనా ఆర్ఎస్ ప్రవీణ్ స్పం దించారా? అని ఆయన నిలదీశారు.గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవీణ్ ఏం చేశారో అందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు.‘బి.ఎస్.పి నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఏం మాట్లాడవో వీడియోలు బయట పెట్టమంటావా?‘ అంటూ హెచ్చరించారు. జీవో 17 గురించి కూడా ప్రవీణ్కు సరైన అవగాహన లేదని విమర్శించారు.
కోడిగుడ్ల కొనుగోలు వ్యవహారంలో రు.600 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపా రు.అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.దోచుకోవడం మీకు అలవాటు, మాకు కాదు అంటూ మండిపడ్డారు.ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.