09-01-2026 12:28:44 AM
బోయినపల్లి: జనవరి 8(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ శాలువా కప్పి సన్మానించారు. గురువారం కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను నీలాజపల్లి సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచును కేంద్ర మంత్రి బండి సంజయ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.