29-01-2026 12:57:14 AM
నాగర్ కర్నూల్ జనవరి 28 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు పరిధిలోని ముస్లిం మైనార్టీలు బుధవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో 14వ వా ర్డులో పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. పార్టీ బలోపేతం దిశగా ప్రతి కా ర్యకర్త కట్టుబాటుతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మైనార్టీ విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ విజయానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు.