21-08-2025 12:05:08 AM
సదాశివపేట, ఆగష్టు 20 : సదాశివపేట పట్టణం, మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. రూ.5,79,000 విలువైన 25 సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడానికి కృషిచేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుధీర్రెడ్డి, మాజీ ఎంపీపీ కిష్టయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, చిల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మండల యువత అధ్యక్షులు నరేష్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు నిజాముద్దీన్, మాజీ కౌన్సిలర్లు మోబిన్ నషీర్, కళిం పటేల్, జున్ను, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.