26 June, 2026 | 6:32 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

తెల్లాపూర్ మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

29-12-2025 01:51 AM

రామచంద్రపురం(పటాన్చెరు), డిసెంబర్ 28 :పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతరలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.

అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, రాగం దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కురుమ సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.