calender_icon.png 25 August, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులపై మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

13-08-2024 05:05:02 PM

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  పటాన్ చెరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై  చర్చించి, వివిధ గ్రామాలలో నూతన రోడ్ల నిర్మాణాలు, రహదారుల మరమ్మతుల నిమిత్తం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే వినతి పత్రం అందించారు.

ప్రధానంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలోని నూతన కాలనీలు ఏర్పాటావుతున్న తరుణంలో రహదారుల నిర్మాణం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నూతన రహదారుల నిర్మాణానికి 43 కోట్ల రూపాయలు, రహదారుల మరమ్మత్తులకు 17 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క త్వరలోనే ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.