8 April, 2026 | 4:21 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

02-11-2025 07:09 PM

చిట్యాల (విజయక్రాంతి): పత్తి రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం తెలిపారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలోని ప్రగతి కాటన్ మిల్లులో, పెద్దకాపర్తి గ్రామంలోని కావేరి కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలను ఆయన ప్రారంభించి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏఎంసి చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ఏఎంసి సెక్రటరీ వేముల రవీందర్ రెడ్డి, డైరెక్టర్ లు ఏనుగు రఘుమా రెడ్డి, సప్పిడి సంజీవరెడ్డి, బోయ వెంకటేష్, కరంటోతు శంకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.