12 July, 2026 | 2:15 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

బోరంచకు బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

05-05-2025 01:52 AM

నారాయణఖేడ్, మే 4: జిల్లాలో ప్రసిద్ధి చెందిన బోరంచ నల్ల పోచమ్మ జాతర మహోత్సవం సందర్భంగా నారాయణ ఖేడ్ నుండి బోరంచ మీదుగా కంకోల్ వరకు ప్రత్యేక బస్సులు ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ నుండి బోరంచ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. అనంతరం స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోకు గత మూడు నెలలు 18 నూతన ఆర్టీసీ బస్సులను తీసుకురావడం జరిగిందన్నారు. జూన్ వరకు మరో 10 కొత్త బస్సులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించాలని అన్నారు.

ఈ సందర్భంగా బస్సులో పలువురు మహిళ ప్రయాణికులతో మాట్లాడారు. జాతర ఉత్సవాలకు హాజరైన భక్తులకు బస్సు సౌకర్యం ఉపయోగపడుతుందని అన్నారు. ఆయన వెంట నారాయణఖేడ్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ అశోక్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సెట్, హనుమాన్లు భూమయ్య అఖిలేష్ రెడ్డి, సంజీవరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం, మార్కెటింగ్ అధికారి పాండు తదితరులుఉన్నారు.