24-08-2025 07:01:33 PM
వలిగొండ,(విజయక్రాంతి): మండల కేంద్రంలో నూతన పద్మశాలి సంఘం పట్టణ కమిటీ ఎన్నుకున్నారు. కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా సాయిని యాదగిరి, అధ్యక్షుడిగా గంజి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు దొంత శ్యామ్ సుందర్, కందగట్ల వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా రచ్చ సంతోష్, కోశాధికారిగా నామాల జగన్మోహన్, సహాయ కార్యదర్శిగా ఎక్కలదేవి శ్రీనివాస్, సంస్కృతిక కార్యదర్శిగా యలగందుల లెనిన్, డైరెక్టర్లుగా పెండెం విగ్నేష్, గంజి ఉపేందర్, గర్దాస్ మనోహర్, బడుగు లింగస్వామి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన కుల పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.