14 April, 2026 | 1:21 PM

Breaking News

సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •  

పివిటిజి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

21-10-2025 09:37 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని చించొలి గ్రామంలో మంజూరు అయిన 48 పివిటిజి ఇండ్ల మంజూరు పత్రాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, జంగు, రాథోడ్ సురేందర్, అనిల్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సుజీల్, కేమ శ్రీకాంత్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.