calender_icon.png 7 November, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

07-11-2025 12:53:45 AM

నాగల్ గిద్ద, నవంబర్ 6: నాగల్ గిద్ద మండల పరిధిలోని పుసల్ పాడ్ గేట్ దగ్గర ఉన్న విజయ కాటన్ మిల్లులో గురువారం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్నిడాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం సిసిఐ అధికారులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు అధికం ఉండడంతో పత్తి రైతులు తీవ్ర నష్టాలపాలు కావడం జరిగిందన్నారు.

పత్తిలో తేమ శాతం కొంచెం ఎక్కువ, తక్కువగా ఉన్నా రైతులకు నష్టం జరగకుండా న్యాయం జరిగే విధంగా సీసీఐ అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ కాటన్ మిల్ యాజమాన్య బృందం, పండరి, నాయకులు పాల్గొన్నారు.