11-10-2025 07:31:48 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయ క్రాంతి): కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్పల్లి మండలంలోని అమ్మనబోలు, పల్లెపహడ్, బెండలపాడు, నక్కలపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.