28-08-2025 10:40:46 PM
పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) గురువారం దర్శించుకన్నారు. మండపం నిర్వాహకులు, నాయకులతో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గణేష్ మండపాల నిర్వహకులు, నాయకులు పాల్గొన్నారు.