24-09-2025 11:12:54 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఇటీవల కాలంలో చరవాణి చోరీ మిస్ కావడం ఎక్కువ జరుగుతున్నాయని చరవానుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ బుధవారం నాడు నాచారం క్రైమ్ టీం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ సహాయంతో పోగొట్టుకున్న 8 చరవాలను రికవరీ చేశారు. ఇట్టి చరవాణిలను ఆయా యజమానులకు ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ సిఐఆర్ ద్వారా పోయిన చరవానులను గుర్తించి వాటిని రికవరీ చేసినట్టు తెలిపారు. సిఐఆర్ ద్వారా చరవాలను గుర్తించిన క్రైమ్ సిబ్బంది వెంకటేశ్వర్లు రాహుల్ ఎలిజ అశోక్ అశ్వినీ లను ఆయన అభినందించారు