17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విపత్తులపై సన్నద్ధత కోసమే మాక్ ఎక్సర్‌సైజ్

22-12-2025 12:11 AM

నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): వరదలు, ఇతర విపత్తులు సంభ వించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త ల విషయంలో సన్నద్ధతను తెలుసుకు నేందుకు వీలుగా ఈ నెల 22న చేపడుతున్న మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. వరదలు, పారిశ్రామిక ప్రమా దాలపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో ఈ మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తోందని తెలిపారు. విపత్తుల నిర్వహణతో అను సంధానం  కలిగి ఉన్న అన్ని శాఖలు సమన్వ యంతో ఒకేసారి అన్ని చోట్ల మాక్ ఎక్స్సజ్ నిర్వహించి, వ్యవస్థల సామర్థ్యం, సన్నద్ధత, సమన్వయాన్ని అంచనా వేయడం జరుగు తుందని అన్నారు.

ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుని, విపత్తులు తలెత్తిన సమయాలలో వాటిని సమర్ధవం తంగా ఎదుర్కొనేలా సమాయత్తం అయ్యేం దుకు మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమం దోహద పడుతుందని అన్నారు. ఇందులో భాగంగా నే నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం 9.00 గంటలకు ఏకకాలంలో మూడు వేర్వేరు చోట్ల వరద సహాయక చర్యలపై మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. బోధన్ డివిజన్ లోని హంగర్గ గ్రామంతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), ఖిల్లా రఘునాథ్ చెరువు వద్ద మూడు ప్రదేశాలలో మాక్ ఎక్సర్ సైజ్ కొనసాగుతుందని వివరించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఎక్సర్ సైజ్ విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.