23-05-2025 05:09:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలోని పాయవాడలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికి చెత్త నిర్వాణకు కారణమైతే వారిపై చర్యలు ఉంటాయని శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్ తెలిపారు. గురువారం పట్టణంలోని పలు వార్డులను సందర్శించి దోమల నివారణకు దోమల పిచికారి మందులు స్ప్రే చేసి మురికి నీరు నిలవకుండా ఇంటి యజమానులు జాగ్రత్త తీసుకోవాలని తడి చెత్త పొడిచిత్తను ప్రత్యేక బుటీల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది ఉన్నారు.