15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

కేంద్ర నిధులు ఏం చేశారు?

17-05-2025 11:38 PM

300 కోట్లు ఎక్కడ అని ప్రశ్నించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివాసులు, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 300 కోట్లు విడుదల చేసినా.. ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఆ నిధులను జిల్లాలకు పంపకుండా, గిరిజనులకు అందకుండా నిలిపివేసిందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) ఆరోపించారు. ఈ నిధులను ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పేద గిరిజనులకు అందాల్సిన ఈ నిధులను కాంగ్రెస్ సర్కారు మళ్లించిందనే అనుమానం కలుగుతోందని, కొలాంస్, తొటి, చెంచు గిరిజనులు గత ఏడాది నుంచే అప్పులు తీసుకుని ఇండ్ల నిర్మాణాలు చేపట్టారని... కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ, గిరిజన విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లోనే నిధులను విడుదల చేసిందన్నారు. ఆర్టికల్ 275(1) కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావాలని నగేష్ డిమాండ్ చేశారు.