20-12-2025 03:17:08 PM
మర్రిగూడ, (విజయక్రాంతి): యరగండ్లపల్లి గ్రామములో టిడిపి సీనియర్ నాయకుడు పుప్పాల పెద్ద యాదయ్య మాతృమూర్తి పుప్పాలవి లక్ష్మమ్మ అనారోగ్యముతో బాధపడుతూ మృతి చెందగా, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులిమామిడి నరసింహారెడ్డి శనివారం మృతురాలి వివాసానికి చేరుకొని పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా 10వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందించారు. ఈకార్యక్రమం లో యరగండ్లపల్లి కాంగ్రెష్ పార్టీ నాయకులు ఉన్నారు.