15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉప సర్పంచ్‌ల ఫోరం రేగొండ మండల అధ్యక్షులుగా నరేష్

26-12-2025 12:00 AM

రేగొండ, డిసెంబర్ 25(విజయక్రాంతి): ఉపసర్పంచ్ ల ఫోరం రేగొండ మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన ఎల్డండి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండలం లోని బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రాంగణంలో 23 గ్రామ పంచాయితీల ఉప సర్పంచ్ లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచుల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

గౌరవ అధ్యక్షుడు గా చుక్క జనార్దన్, ఉపాధ్యక్షులు గా పెండెల శంకర్, ఆకుతోట తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా నీరటి రంజిత్, కార్యదర్శి గుర్రం రమేష్ , కోశాధికారిగా గడల చిన్న సాంబయ్య, కార్య వర్గ సభ్యులుగా గుర్రం రాంబాబు, రాజేష్, బండి వెంకటేష్, సకినాల రవీందర్ లను ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నం దుకు ఎల్దండీ నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచ్ ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.